ఈ మధ్యనే టి వి లో ఒక సీరియల్ యాడ్ చూసాను.
"మనసే మనిషికి శత్రువా" అనే కాప్షన్ తో సా........గుతుంది సీరియల్.
అయితే ప్రత్యేకించి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి.
ముఖ్య పాత్రధారిణి (ఆవిడ పేరు తెలియదు), నాగేంద్రబాబు భార్య పాత్ర పోషిస్తున్న ఆవిడ నటన చూస్తుంటే మాత్రం తెగ నవ్వొస్తుంది. కామెడీ రోల్ అనుకునేరు, కాదు చాలా సీరియస్ రోల్.
ప్రోమోస్ లో కొన్ని సన్నివేశాలలో డైలాగు
"ప్రేమంతా మికే పంచాలా నేను పంచను" అనే డైలాగుని ఆవిడ చెప్పిన రీతి చుస్తే జన్మలో మరచిపోలేరు.
- లాస్య రామకృష్ణ

4 comments:
hahaahaha all serials are like that madam
ammo vati joliki vellaalantene bhayam
అవునండి. నిన్న ఇంకో భయంకరమైన డైలాగ్ విన్నాను ఆ సీరియల్ లో...
నాగేంద్ర బాబు చిన్న భార్య..గతంలో ఆయనకు స్టూడెంట్.
ఆమె గురువునే ఎందుకు పెళ్లి చేసుకుందో ఆమె మాటల్లోనే
" ఏకలవ్యుడూ గురువు గారికి తన బొటన వేలు ఇచ్చి గురు దక్షిణ ఇవ్వాల్సిన బాధ్యత తెలియజేశాడు. అలాగే నేను నా గురువుకి నా మాతృత్వాన్ని కానుకగా ఇవ్వాలనుకున్నాను."
ఈ డైలాగ్ రాసిన వాడు నిజంగా మనిషేనా..? గురువుకు మాతృత్వం దక్షిణ ఇవ్వడం ఏమిటి..?
ఇచ్చింది మాతృత్వమా....శీలమా..?
నేను ఆ సీరియల్ లో ఒక భయంకరమైన డైలాగ్ విన్నాను. అందులో నాగేంద్రబాబు చిన్న భార్య....( వీళ్ల బొంద. సీరియల్ లో హీరో అంటే కనీసం ఇద్దరు భార్యలైనా ఉండాలన్న మాట.) ఆయన స్టూడెంట్. గురువు గారినే పెళ్లి చేసుకుంటుంది. ఎందుకో ఆ మాటల్లోనే వినండి.
" ఏకలవ్యుడు గురువుకి బొటనవేలు గురుదక్షిణ ఇచ్చి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. అంత కన్నా గొప్పగా గురు శిష్యుల బంధాన్ని చాటి చెప్పాలనుకుని గురువుకు నా మాతృత్వాన్ని కానుకగా ఇచ్చాను "
ఈ డైలాగ్ కు ఏమైనా అర్థం ఉందా...?
గురువుకు కానుక ఇచ్చింది మాతృత్వమా...దేహమా..?
Post a Comment