పండు మిరపకాయ - గోంగూర
పండు మిరపకాయ - 10
గోంగూర - 2 కట్టలు
సెనగపప్పు - టీ స్పూను
మినప్పప్పు - టీ స్పూను
ఆవాలు - టీ స్పూను
వెల్లుల్లి రెబ్బలు - ఆరు
ఉల్లి తురుము - అరకప్పు
నూనె - తగినంత
ఉప్పు - సరిపడా
తయారు చేసే విధానం
పండు మిరపకయల్ని శుభ్రంగా కడగాలి. తొడిమలు అలానే ఉంచి నిలువుగా చీల్చాలి. ఇప్పుడు ఓ గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసి మిరపకాయలు వేసి ఉడికించాలి.
మిరపకాయలు ఉడికిన తర్వాత వాటిని బయటకు తీసి అవే నీళ్ళల్లో గోంగూర వేసి ఉడికించాలి.
గోంగూర ఉడికిన తర్వాత మిక్సీ లో మెత్తగా రుబ్బాలి.
బాణలిలో నునే వేసి కాగాక ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, వెల్లులి వేసి వేయించాలి. తరువాత ఉడికించిన పండు మిరపకాయలు వేసి బాగా కలపాలి. మిరపకాయలు విరిగిపోకుండా వేయించాలి. తరువాత మెత్తగా రుబ్బిన గోంగూర వేసి బాగా కలిపి ఉప్పు వేసి మరో రెండు నిముషాలు వేగనిచ్చి పచ్చి ఉల్లిపాయముక్కలు వేసి కలిపి దించాలి.
- లాస్య రామకృష్ణ






